mettaseema

"మెట్టసీమ" తూర్పు గోదావరి జిల్లాలో మెట్టప్రాంతఆకాంక్షలకు ప్రతిరూపం .పచ్చగా ఉండే కోనసీమ లాగేమెట్ట ప్రాంతం పచ్చ పచ్చ గా పాడి పంటలతోతులతూగాలని పత్రికకు "మెట్టసీమ " పేరు పెట్టడంజరిగింది ....అనుకున్న విధం గానే సీమ లోమార్పులు వస్తున్నై .గోదావరి జలాలు మెట్టసీమ కుమెల్ల మెల్ల గా తరలి వచ్చి "మరో కోన సీమ" గామారుస్తున్నై .ఇక రాజకీయం గా తల పండిన నేతలకు ప్రాంతం పుట్టినిల్లు .శరవేగం గా రాజకీయమార్పులు జరిగి పోతున్టై......ప్రతి వార్తలోను వాస్తవరాజకీయ కోణాని వెలికి తీసి... ప్రజల ,నేతల ,కార్యకర్తల మనోభావాలకు అద్దం పడుతుంది "మెట్టసీమ "

8, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ నందు నూతనం గా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు




శ్రీ వెంకట నాగ టెక్నో స్కూల్ నందు నూతనం గా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసారు. స్కూల్  అధినేత కురుకూరి రామ చంద్ర రావు అద్వర్యంలో సుమారు ఎనిమిది లక్షల ఖర్చుతో నెలకొల్పిన రింగ్ ను పారిశ్రామికవేత్త  కొత్త భైరవ కృష్ణ ప్రారంబించారు .ఈ సందర్భం గా మాట్లాడుతూ ...జగ్గంపేట పరిసర ప్రాంత పిల్లల ఆనందం కోసం దీనిని ఏర్పాటు చేసామని అన్నారు .తమ స్కూల్ విద్యార్దులతో పాటు ఏ స్కూల్ విద్యార్దులు అయిన స్కేటింగ్ నేర్చు కోవచ్చునన్నారు .ఈ నెల ఇరవై అయిదు తేది నుంచి  నెల రోజుల పాటు అందరికి ఉచితం గా శిక్షణ ఇస్తామని తెలిపారు ..ప్రారంబోత్సవం సందర్భంగా కోచ్ నాగ బాబు చే  ట్రైనింగ్ పొందిన నలబై మంది చిన్నారులు చేసిన స్కేటింగ్ విన్యాసాలు అలరించాయి .వారికి బహుమతులు అందచేసారు .ఈ కార్యక్రమం లో నేతలు మారిశెట్టి భద్రం ,బండారు రాజ ,జీను మణిబాబు,కొత్త కొండబాబు ,గఫూర్ ,ఒమ్మి రఘురాం ,ప్రిన్సిపాల్ దేవదాస్ ప్రబృతులు పాల్గున్నారు video

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి